తెలుగునాట రామోజీ అంటే కేవలం వ్యాపారి.., ఈనాడు అధినేత.., ఫిలిం సిటీ అధినేత.., ఓ సామాజికవర్గానికి బ్రాండ్ అనే తెలుసు…!! అంతకు మించి ఆయన ఒక “రాజకీయ ముదురు”.., చంద్రబాబు చాణక్యుడు అయితే ఆయన అపార చాణక్యుడు.., ఎన్టీఆర్ ఒక మహానాయకుడు అయితే ఈయన ఒక మహాపాలకుడు…! టీడీపీ అనేది ఒక పార్టీ అయితే ఈయన ఒక పిల్లర్…! వ్యాపారం ఎలా చేయాలో…, రాజకీయం ఎలా, ఎప్పుడు చేయాలో.., ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో.., ఏ సమయంలో ఎటువంటి వార్తలు రాయించాలో బాగా ఆరితేరిన వ్యక్తి..! ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారేమో…!
మీకు తెలుసా…!!
“బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల మేరకు ఫాల్ట్ లైన్ ఉంది. తీరంలో పెద్ద చీలిక ఏర్పడింది. అది కూడా తూర్పుగోదావరి, శ్రీకాకుళానికి మధ్య ఏర్పడింది. భవిష్యత్తులో పెద్ద సునామీలు, తుపాన్లు వచ్చేస్తాయి. ఆ ప్రాంతం మొత్తం కొట్టుకుపోతుంది. అంటే ఇప్పటికీ అర్ధమయింది కదా… ఎక్కడ అనేది.!! విశాఖపట్నంలో అన్నమాట. అంటే విశాఖపట్నం తీరంలో చీలిక వచ్చింది, భవిష్యత్తులో సునామీలు వచ్చేస్తాయి. మొత్తం కొట్టుకుపోతుంది” అని రామోజీ రాశారు. తన మానస పుత్రిక ఈనాడులో మొదటిపేజీ లో రాయించారు.
ఉద్దేశం గ్రహించాల్సింది ఎవరు…??
పాపం చూసారా…!! రామోజీకి మన రాష్ట్రం, రాజధాని అంటే ఎంత ప్రేమో…!! భవిష్యత్తుని ఊహించి, శాస్త్రవేత్తలు చెప్పారని ఆయన ఎంతగా చెప్పారో…!! అందుకే రామోజీని అన్ని అనేది. అది బుర్ర కాదు. అదో అస్త్రాలు.., ఆయుధాల కర్మాగారం. ఎప్పుడు, ఏ సమయంలో ఏ రోజు ఏ వార్తా రాయాలో, రాయించాలో తెలిసిన మహా మేధావి. అందుకే నాలుగు దశాబ్దాలుగా తన సామ్రాజ్యం బీటలు వాలకుండా నెట్టుకొస్తున్నారు. పాపాలన్నీ మూటలు కట్టుకుని, సామ్రాజ్యపు పునాదుల కింద పాతి పెట్టేసారు. బయటకు తీసేవాళ్ళు ఇప్పట్లో రారు అనేది ఆయన ధీమా.!!
గవర్నర్ ఈరోజో, రేపో మూడు రాజధానుల బిల్లుపై నిర్ణయం తీసుకుంటారు. అందుకే రామోజీ గారికి ఈ అస్త్రం దొరికింది. జగన్ కి ఇవన్నీ తెలుసు, రామోజీ ఎత్తులన్నీ తెలుసు. అందుకే గవర్నర్ మదిలో, కేంద్రం మదిలో ఓ ఆలోచన కలిగేలా “బాబు , విశాఖపట్నం భవిష్యత్తులో ఉండదు. సునామీలో కొట్టుకుపోతుంది, ఇది మేము అన్నమాట కాదు. శాస్త్రవేత్తలే చెప్తున్నారు. కావాలంటే ఆ పరిశోధనల జర్నల్స్ చదువుకోండి” అంటూ చేతులు దులుపుకున్నారు.
దీనిలో ఎక్కడా డైరెక్ట్ గా విశాఖ రాజధానిగా వద్దు, నష్టం వస్తుంది, భవిష్యత్తులో నష్టం ఉంటుంది అనే ప్రస్తావన ఉండదు. అలా రాస్తే మళ్ళీ ఆ ప్రాంతంలో దెబ్బ తినేస్తారు. జగన్ కన్నెర్ర జేస్తారు…! అందుకే “శాస్త్రవేత్తలు చెప్పారు, భవిష్యత్తులో సునామీలు వచేస్తాయట. జాగ్రత్తగా ఉండాలి, మీ మంచికే చెప్తున్నాం” అంటూ ఇది పరోక్షంగా చెప్పడం. పాఠకుల్లో ఒక భయం, విశాఖ వాసుల్లో ఒక ఆలోచన, గవర్నర్ మదిలో ఓ ఆలోచన, కేంద్రం పెద్దల మదిలో ఓ విత్తనం నాటేసి వదిలెయ్యడమే ఈ రాతల ఉద్దేశం. అందుకే ఆయన “రామోజీ” అయ్యారు. మహాభారతంలో యుద్ధం చేసింది కౌరవులు, నష్టపోయింది కౌరవులు. కానీ చేయించింది మాత్రం శకుని..!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!