CBSE Tenth class results: పదవ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ మంగళవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ బోర్డు నేటి మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్లు cbseresults.nic, cbse.nic.in లతో పాటు డిజిలాకర్ యాప్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు తమ రోల్ నంబర్ తో పాటు స్కూల్ కోడ్ కడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
దేశంలో కరోనా సెకండ్ వేప్ ఉధృతి నేపధ్యంలో సీబీఎస్ఈ ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలతో పాటు 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మార్కుల విడుదల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని ఫలితాలు ప్రకటించింది. ఇప్పటికే 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్ఈ తాజాగా నేడు పదవ తరగతి ఫలితాలను విడుదల చేసింది. సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపింది.