వాయు కాలుష్యం నివారణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది.. అయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో కొనుగోలుదారులు సంకోచిస్తారు.. ఇందులో చార్జింగ్ సమస్య అతి ముఖ్యమైనది.. ప్రముఖ హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ కొన్ని పెట్రోల్ పంపుల వద్ద స్వాపబుల్ బ్యాటరీ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.. దీని కోసం వోల్ట్ అప్ బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది.. పూర్తి వివరాలు ఇలా..
జైపూర్లోని హిందుస్థాన్ పెట్రోలియం లోని రెండు స్టేషన్ లో బ్యాటరీ స్వాపబుల్ స్టేషన్ నిర్వహించారు.
ఈ ఒప్పందం ద్వారా టు వీలర్, త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలను మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ చేయడానికి ఒక గంట సమయం పడుతుంది.. దీనివలన డ్రైవర్ కి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది..
దీని కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు.. ఈ సమస్యకు పరిష్కారం బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ.. దీని వలన ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించిన బ్యాటరీ ని భర్తీ చేసే సౌకర్యం ఉంటుంది ఇది బ్యాటరీ ఛార్జ్ చేసే సమస్యను నివారిస్తుంది ఇందు కోసం చాలా ఎలక్ట్రిక్ వాహనం సంస్థలు మెట్రో నగరాల్లో తమ వాహనం కోసం స్వాపబుల్ స్టేషన్లను నిర్మిస్తున్నారు.