Cheque Book : 31 మార్చి 2021తో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది.. ఏప్రిల్ 1 వ తేది నుంచి 2021 – 22 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది.. ఆర్థిక లావాదేవీల తో పాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి.. ఇప్పటికీ కష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అలా విలీనం అయినా బ్యాంకుల చెక్ బుక్ లు 31 మార్చి 2021 వరకు చెల్లుబాటు అయ్యాయి.. ఇక 1 ఏప్రిల్ 2021 నుంచి ఈ బ్యాంకులు తమ ఖాతాదారులు చేసిన జారీ చేసిన చెక్ బుక్ లు, పాస్ బుక్ లు చెల్లుబాటు కావు.. 1 ఏప్రిల్ 2021 నుంచి ఈ బ్యాంకులు విలీనమైన బ్యాంకులకు సంబంధించి చెక్ బుక్ లు ఐఎఫ్ఎస్సి, ఎంఐసిఆర్ కోడ్ శాఖలు తదితర వివరాలు మారిపోనున్నాయి..
* ఈ ఆర్థిక సంవత్సరం లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అయ్యాయి. కెనరా బ్యాంకు లో సిండికేట్ బ్యాంక్ విలీనం అయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు విలీనం అయింది. కార్పొరేషన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ విలీనం అయింది.
*కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంకు లో విలీనమైన బ్యాంకుల కస్టమర్లు తమ శాఖలను సంప్రదించి 31 మార్చి 2021 లోపు మారిన చెక్ బుక్, పాస్ బుక్ లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్ఎస్సి, ఎంఐసిఆర్ కోడ్ తెలుసుకోవాలి.
* ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకులు తమ ఖాతాదారుల మొబైల్ నంబర్లకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి. మారనున్న ఐఎఫ్ఎస్సి, ఎంఐసిఆర్ కోడ్ గురించి మెసేజ్ లు ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి.
*విలీనం కాకముందు పాత బ్యాంకుల్లో తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు , ప్రావిడెంట్ ఫండ్, రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్లు, బీమా పాలసీ , ఆదాయం పన్ను ఖాతాలను అప్డేట్ చేసుకోవాల్సిందిగా సదరు బ్యాంకు లు సూచిస్తున్నాయి.
* సిండికేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు 30 జూన్ 2021 తేదీ వరకు పాత చెక్ బుక్ ల లావాదేవీలు జరుపుకునేందుకు కల్పించింది.