Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లైనప్ చేసుకున్న సినిమాల ప్రకారం ఆయన దూకుడు చూస్తే ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసేస్తారని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కానీ కరోనా మెగాస్టార్ దూకుడు కి బ్రేక్ వేసింది. మూడు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటే కనీసం రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఇంకా చెప్పాలంటే రెండవ సినిమా స్టార్ట్ కూడా కాలేదు. జస్ట్ ఓపెనింగ్ మాత్రమే అయింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది.
ఇక ఈనెల 6వ తేదీ నుంచి ఆచార్య సినిమా షూటింగ్ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసేందుకు షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. కేవలం 12 రోజులలోనే షూటింగ్ కంప్లీట్ కానుంది. అంటే ఈ నెల 20 వరకు ఆచార్య కి గుమ్మడికాయ కొట్టనున్నారని తెలుస్తోంది. దాంతో మెగాస్టార్ మరో రెండు సినిమాలను సెట్స్ మీదకి తీసుకురానున్నాడట. మెగాస్టార్ ఆచార్య కంప్లీట్ అవుతూనే మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ ను మొదలు పెట్టబోతున్నారట. దాదాపు కాస్టింగ్ సెలక్షన్ కూడా పూర్తయినట్టు సమాచారం. అలాగే మరో సినిమాను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అది వేదాళం రీమేక్, లేదా మైత్రీ మూవీస్ నిర్మాతలుగా లేదా బాబీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా అని తెలుస్తోంది.
Chiranjeevi : ఆచార్యతో పాటు ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంటాయట.
మెగా కాంపౌండ్ ద్వారా అందుతున్న తాజా సమాచారం ఏమిటంటే ఆచార్యతో పాటు ఈ రెండు సినిమాలను కూడా ఇదే ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అన్నీ పరిస్థితులను అనుకూలంగా ఉంటే ఈ సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ ఆచార్య సినిమా మీద పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. ఇక ఆచార్యతో పాటు ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంటాయట. లూసీఫర్ రీమేక్ షూటింగ్ ఆగస్టులో మొదలు పెట్టనుండగా, వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారట.