Ys Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కి వచ్చిన తర్వాత తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వైయస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులను ఆలోచనలో పడేస్తున్నాయి. అంతేకాకుండా ఏపీలో జగన్ అమలు చేస్తున్న నిర్ణయాలు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలలో అమలు చేసే రీతిలో ఆలోచనలు చేస్తున్నారు. అందుకేనేమో ముఖ్యమంత్రి గా రెండు సంవత్సరాలు పూర్తిగా నిండక ముందే దేశంలోనే టాప్ ముఖ్యమంత్రులలో ఒకరిగా చాలా సర్వేలలో జగన్ స్థానం కల్పించికున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమాజంలో వెనుకబడిపోయిన వర్గాలను పైకి తీసుకు రావటానికి విద్య, వైద్య వ్యవస్థలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ తాజాగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు విద్యుత్ ఈ విషయంలో 200 యూనిట్ల లోపు వాడితే వాటికి చెల్లింపు ప్రభుత్వమే డబ్బులు కడుతుందని నిర్ణయం తీసుకోగా, తాజాగా మరోసారి కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మేటర్ ఏమిటంటే ఇటీవల ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో.. వారానికి ఒక సారి జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలు… ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లాలని సూచించారు. ఈ విధంగా వారితో మమేకం అవ్వడం వల్ల.. వారి యోగక్షేమాలను తెలుసుకోవడమే కాక, వాళ్లకి ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది అని తెలిపారు. అదే రీతిలో పోలీసులు కూడా అనగారిన వర్గాలకి దగ్గర అవుతారని.. రాబోయే రోజుల్లో జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీలు ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలో వారానికోసారి పర్యటించాలని జగన్ తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మూడు నెలలకోసారి జిల్లా ఇన్చార్జి మంత్రులు ఎస్సీ, ఎస్టీ నిరోధక వేధింపుల చట్టం అమలు తీరుపై సమీక్ష చేయాలని జగన్ సూచించారు. అమలు తీరు పై నివేదిక ఇవ్వాలని, ఈ విధంగా జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టి సారిస్తుందని జగన్ తెలిపారు.