Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటుగా నక్సల్ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలుగా.. పేరొందిన ..తెలంగాణ.. చతిస్ ఘడ్, ఒడిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎంలతో..మావోయిస్టు ప్రాంతాలలో శాంతి భద్రతలు అదే రీతిలో అభివృద్ధి గురించి చర్చించనున్నట్లు సమాచారం. రేపు ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఇదిలా ఉంటే జరగబోయే ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కూడా హాజరుకానున్న క్రమంలో నేడు.. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఢిల్లీ బయలుదేరటానికి ఏర్పాట్లూ చేసుకున్నారు.