ఏదైనా వాహనంలో ప్రయాణానికి వెళ్తున్నారా..? అయితే మీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నారా..? అసలేంటి ఈ ఫాస్ట్ ట్యాగ్ అంటారా..?సాధారణంగా మనం ఏదైనా ప్రయాణానికి వెళుతున్నప్పుడు మధ్యలో టోల్ గేట్ వద్ద టోల్ ప్లాజా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. అయితే టోల్ గేట్ దగ్గర ఎక్కువ సేపు వేచి ఉండకుండా నేరుగా వాహనానికి ఒక ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసి నేరుగా కస్టమర్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేస్తుంది..! ఈనెల డిసెంబర్ 24న ఫాస్ట్ ట్యాగ్ ద్వారా మొత్తం 80 కోట్ల టోల్గేట్ ఫీజులు వసూలు చేశారు.. భారతదేశంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం మొత్తాన్ని సృష్టించి ఓ మైలురాయి ని చేరుకుంది..
50 మిలియన్ లకు పైగా ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీల ద్వారా ఈ రికార్డు సృష్టించింది.. నేషనల్ హైవే అథారిటీ దీనికి సంబంధించిన సమాచారాన్ని 25న ప్రకటన విడుదల చేసింది. 1 జనవరి 2021 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పని సరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.. దీంతో ఎక్కువ సంఖ్యలో వాహనదారులు దీనిని ఉపయోగించడంతో ఇంత పెద్ద మొత్తాన్ని సృష్టించి ఓ మైలురాయి ని చేరుకుంది.ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించడం వల్ల వాహనదారులు ఎక్కువసేపు టోల్గేట్ వద్ద వేచి ఉండనవసరం లేదు..
ఇది వాహనదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఇంధనాన్ని అన్ని కూడా ఆదా చేస్తుంది. దీనివలన ఒకేసారి రెండు ప్రయోజనాలు కలుగుతాయి.. సాధారణంగా టోల్ గేట్ దగ్గర ఎక్కువసేపు వేచి ఉండటం వలన ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడుతుంది..వాహనాలకు ఫాస్ట్ టాగ్ ఏర్పాటు చేసినట్లయితే టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్కానర్లు వాహనం ముందు ఉన్న అతికించిన స్టిక్కర్లను స్కాన్ చేస్తాయి. ఇది టోల్ గేట్ ఫీజు ఫాస్ట్ అకౌంట్ లో నుంచి ఆటోమేటిక్ గా కట్ చేస్తుంది. ఇది కాగిత రహితమని చెప్పొచ్చు. కరోనా సమయంలో వైరస్ ను తగ్గించడానికి, సామాజిక అంతరాన్ని పాటించేందుకు సహాయపడతాయి. వెంటనే ఫాస్టాగ్ ను స్వీకరించడం మంచిది..