ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ కూడా ఇప్పుడు కొత్త ఫీచర్ ను విడుదల చేసింది. కొత్తగా డిస్కార్డ్ రూమ్స్ మాదిరిగా గ్రూప్ వాయిస్ చాట్ సిస్టమ్ ను ప్రారంభించింది. వినియోగదారులు కొత్తగా చేసుకునే యాప్ అప్ డేట్ లో వాయిస్ చాట్ కి కూడా అనుమతిస్తుంది. వాయిస్ చాట్ లు గ్రూప్ కాల్స్ కావు కానీ అలంటి అనుభవాన్ని అందివ్వగలవు అని టెలిగ్రామ్ తెలిపింది. ఈ అప్డేట్ కు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా లాక్ డౌన్ తర్వాత స్నేహితులతో, కుటుంబ సభ్యులతో డైరెక్ట్ గా మాట్లాడం కంటే ఫోన్లలోనే ఎక్కువగా కలుస్తున్నారు. ఏదైనా గ్రూపులో ఎల్లప్పుడూ ఆన్ లో ఉండే విధంగా వాయిస్ చాట్ రూమ్ ను ఏర్పాటు చేశారు సంస్థ యాజమాన్యం. వాయిస్ చాట్స్ గ్రూప్ కాల్స్ మాదిరిగా ఉండవు. వాయిస్ చాట్ సమయంలో ఎవరు మాట్లాడుతున్నారో గ్రూప్ సభ్యులు సులభంగా తెలుసుకోవచ్చు అని తెలిపింది. ఆన్-స్క్రీన్ లో మైక్రోఫోన్ నియంత్రణలు కూడా ఉన్నాయి. దీని ద్వారా గ్రూప్ సభ్యులను త్వరగా మ్యూట్ చేయడానికి / అన్-మ్యూట్ చేయడానికి లేదా సంభాషణలను ముగించడానికి ఉపయోగపడతాయి. ఆండ్రాయిడ్లోని టెలిగ్రామ్ వినియోగదారులకు మైక్రోఫోన్ నియంత్రణలను చూపించే సిస్టమ్-వైడ్ ఫ్లోటింగ్ విడ్జెట్ ఉంటుంది.
గ్రూప్ వాయిస్ చాట్ లోని సభ్యులను ఎక్కువ మందిని ఆహ్వానించడానికి అనుమతించే అవకాశం కూడా కల్పించారు. వాయిస్ చాట్స్లో ఒకే సారి కొన్ని వేల మంది పాల్గొనే అవకాశాన్ని ఇస్తున్నది. వాయిస్ చాట్ ప్రారంభించడానికి నిర్వాహకులు ఏదైనా గ్రూపును ఓపెన్ చేసి వాయిస్ చాట్ ను ప్రారంభించవచ్చు. ఈ కొత్త గ్రూప్ వాయిస్ చాట్ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOSలోని టెలిగ్రామ్ యాప్ లో మరియు టెలిగ్రామ్ డెస్క్ టాప్ అందుబాటులో ఉంటుంది. ఐ ఫోన్ వినియోగదారులు తమ హెడ్ ఫోన్లలో ఇన్కమింగ్ మెసేజ్లను స్పీకర్లో చదవడానికి సిరిని ఉపయోగించవచ్చు. ఈ ఫిచర్ వినియోగిస్తున్నపుడు లోపాలను గుర్తిస్తే తెలపడానికి టెలిగ్రామ్ పబ్లిక్ బగ్ మరియు సూచన ప్లాట్ ఫామ్ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులకు వీడియో సందేశాలు కూడా పంపుకోవచ్చు.