Aditya L -1 Mission: పది రోజుల క్రితం అంతరిక్షంలో భారత్ తనదైన ముద్ర వేసింది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రయాన్ – 3 మిషన్ లో బాగంగా విక్రమ్ ల్యాండ్ ద్వారా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై దిగి అక్కడి పరిస్థితులను ఫోటోలు తీసి ఇస్రోకు పంపుతోంది. తాజాగా ఇస్రో మరో చారిత్రక మిషన్ చేపట్టింది. సూర్యుడిపై పరిస్థితులను అధ్యయనానికి ఆదిత్య ఎల్ – 1 ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ మేరకు పీఎస్ఎల్వీ సీ 57 వాహన నౌక ఆదిత్య ఎల్ 1 ను విజయవంతంగా నింగిలోకి మోసుకువెళ్లింది. రాకెట్ నుండి ఆదిత్య ఎల్ 1 విజయవంతంగా విడిపోయింది. దానిని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో వెల్లడించింది.
అయితే చంద్రుడిపై చంద్రయాన్ – 3 ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య ఎల్ – 1 కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా..? సూర్యుడి మీదకు ఆదిత్య ఎల్ 1 వెళితే కాలి బూడిద అయి పోదా..? అనే సందేహాలు అందరిలోనూ వస్తుంటాయి. అయితే గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. సూర్యుడు వాయుగోళం మారిదిగా ఉంటాడు. దీంతో సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం నాసాకు చెందిన ప్రొబ్ అనే రాకెట్ కరోనాలోకి ప్రవేశించి పరిశోధనలు చేసింది. ఇప్పుడు ఆదిత్య ఎల్ -1 నిరంతరాయంగా సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. ఆదిత్య ఎల్ 1 తాను నిర్దేశించుకున్న లాగ్రాంజ్ పాయింట్ చేరడానికి సరాసరి 125 రోజుల సమయం పట్టనుంది. భూమి నుండి దాదాపు 15 లక్షల కిలో మీటర్లు ప్రయాణం తర్వాత ఇది కక్ష్యలోకి చేరుతుంది.
లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక హాలో కక్ష్యలో ఉంటుంది. లాగ్రాంజ్ పాయింట్ అనేది అంతరిక్షంలో ఉన్న ప్రదేశం. సూర్యుడికి దాని స్వంత గురుత్వాకర్షణ ఉంది. భూమికి దాని స్వంత గురుత్వాకర్షణ కూడా ఉంది. అంతరిక్షంలో ఈ రెండింటి గుత్వాకర్షణ ఒకదానికొకటి ఢీకొంటుంది. లేదా భూమి, సూర్యుని గురుత్వాకర్షణ ఎక్కడ సమానంగా ఉంటుందో ఆ పాయింట్ ను లాగ్రాంజ్ పాయింట్ అంటారు. భూమి, సూర్యుడి మధ్య అటువంటి 5 లాగ్రాంజ్ పాయింట్లు గుర్తించారు. భారతదేశానికి చెందిన సూర్యన్ లాగ్రాంజ్ పాయింట్ 1 అంటే ఎల్ 1కి వెళ్లి పరిశోధన చేస్తుంది. ఈ పాయింట్ లో భూమి, సూర్యుడు గురుత్వాకర్షణ శక్తులు దాదాపు సమానంగా ఉంటాయి.
అక్కడ ఒక చిన్న శరీరాన్ని ఉంచినట్లయితే అది అక్కడే ఉంటుంది. కాబట్టి ఆదత్య ఎల్ 1 ప్రయోగం బ్యాలెన్స్డ్ గా వెళ్లనుంది. అదిత్య వెళుతున్న కక్ష్యలోని విశేషం ఏమిటంటే.. సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు టెలిస్కోప్ భూమికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది. ఇది సూర్యుని వేడి నుండి ఉపగ్రహాన్ని సన్ షీల్డ్ టెలిస్కోప్ ను రక్షించడంలో సహాయపడుతుంది. ఆదిత్య ఎల్ 1 లో ఏడు పేలోడ్లు ఉంటాయి. దీనిలో నాలుగు పేలోడ్ లు నిరంతరం సూర్యుడిపై నిఘా ఉంచుతాయి. మూడు పేలోడ్ లు పరిస్థితులకు అనుగుణంగా కణ, అయిస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేస్తాయి. ఫోటోస్పియర్ క్రొమోస్పియర్ పేలోడ్ ద్వారా అధ్యయనం చేస్తుంటుంది.
ఇప్పటికే చంద్రయాన్ 3 తో ప్రపంచంలో భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది ఇప్పుడు ఆదిత్య ఎల్ 1 తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసుకునేలా సరికొత్త ప్రయోగాన్ని సంధించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్ గురించే చర్చ నడుస్తొంది. భారత్ శాస్త్ర సాంకేతిక నైపణ్యం గురించి ఇతర దేశాలు చర్చించుకుంటున్నాయి.
One Nation – One Election: మోడీ గనక ఆ ప్రకటన చేస్తాడేమో అని భయం తో వణుకుతున్న కెసిఆర్ పార్టీ ?