One Nation – One Election: కొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరో మూడు నెలల సమయమే ఉండటంతో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇటీవల అభ్యర్ధులను జాబితాను ప్రకటించింది. దీంతో అభ్యర్ధిత్వాలు ఖరారు అయిన నేతలు ప్రచారంలో దిగిపోయారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి వెళుతున్నారు. హామీలు ఇస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఓ సంచలన నిర్ణయాన్ని తెరిపైకి తీసుకురావడంతో బీఆర్ఎస్ లో గుబులు పట్టుకొందని అంటున్నారు. జమిలి ఎన్నికలను (వన్ నేషన్ ..వన్ ఎలక్షన్) తెరిపైకి తీసుకురావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమిటి..? బీఆర్ఎస్ నేతలు ఎందుకు కలవరపడుతున్నారు.. ? అనే విషయాలను ఒక సారి పరిశీలన చేస్తే..
కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యుల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. దీని ఆలోచనలో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఏకంగా 115 మందితో అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో నేతలు మునిగిపోయారు. ఇదే తరణంలో కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్దమైతే అసెంబ్లీ ఎన్నికల సమయం మరో రెండు మూడు నెలలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన అభ్యర్ధులు జమిలి ఎన్నికల కసరత్తు పూర్తి అయ్యే వరకూ తమ ఎన్నికల ప్రచారం కొనసాగించాల్సి ఉంటుంది. దీని వల్ల అభ్యర్ధులకు ఖర్చు ఎక్కువ అవుతుంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్ధులను యధావిధిగా కొనసాగిస్తారా లేక మార్పులు చేర్పులు చేస్తారా అనే ఆందోళన కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతల్లో ఉందని అంటున్నారు. అయితే జమిలి ఎన్నికలు సాధ్యం కాదని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో మోడీ జెమిలీ పాట పాడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం కేసిఆర్ అయితే ఇప్పటి వరకూ స్పందించలేదు. జమిలి ఎన్నికలు వస్తే అధికార బీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
Chandrababu: కొడాలి నాని ని ఎలాగైనా ఓడించాలి అనే ప్లాన్ వేసిన చంద్రబాబు.. ఇది వర్క్ అయ్యేలాగే ఉందే !