పనిమీద బైక్ పై బయటికి వెళ్తున్నారా..? అయితే హెల్మెట్ ధరించారా..? అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నరా..? అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? బెంగళూరు నగర వీధుల్లో “ఆపరేషన్ సర్ ప్రైజ్ చెక్” పేరుతో ట్రాఫిక్ పోలీసులు బైక్ రైడర్స్ ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించారు..! ఈ ప్రత్యేక డ్రైవ్ లో రెండు గంటల సమయంలో సుమారు రెండు గంటల వ్యవధిలో రూ.29.5 లక్షల జరిమానాను వసూలు చేయడం విశేషం..
ట్రాఫిక్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం చాలామంది వాహనదారులు వన్ వేలో వెళ్ళడం, సాఫ్టీ బెల్ట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం, బైక్ రైడర్స్ హెల్మెట్ ధరించుట పోవడం, పేమెంట్ లపై ప్రయాణించడం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వలన ఈ ఫైళ్లను విధించినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా ఈ నెల డిసెంబర్ 13-19 మధ్యలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు 78,754 కేసులను నమోదు చేసి రూ.4,02,07,200 లను వివిధ ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా జరిమానాను వసూలు చేయడం గమనర్హం.
బెంగళూరు నగరంలోని 178 ప్రాంతాలలో ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రత్యేకమైన డ్రైవ్ ను నిర్వహించగా, ఇందులో 44 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని 6,247 కేసులను నమోదు చేశారు. ఈ ఈ కేసుల ద్వారా రూ.29,47,50 జరిమానా వసూలు చేసినట్లు, ఈ ప్రత్యేక డ్రైవ్ ను ఇంతకుముందు ప్రదేశాలలో నిర్వహించినట్లు, మిగతా ప్రాంతాల్లోనీ వాహనదారులు నిర్వహినిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.. కాబట్టే ఇంత అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, నగరంలో లో ఇలాంటి సర్ప్రైస్ చెక్ లను రానున్న రోజుల్లో మరిన్ని చేస్తామని, దీనివలన ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ బిఆర్ రవికాంత్ గౌడ వివరించారు.