NewsOrbit
న్యూస్

జ్ఞానోదయం అయ్యిందా… కాంగ్రెస్ మళ్లీ ఆ తప్పు చేయడం లేదు!

భారతదేశం గర్వించదగ్గ ప్రధానుల్లో.. తనమార్కు పాలనను అందించిన ప్రధానుల్లో.. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రధానుల్లో పీవీ నరసింహరావు ఒకరు! కాంగ్రెస్ పార్టీకి తనమార్కు వైభవాన్ని యాడ్ చేసిన పనితనం ఆయన సొంతం. కానీ…కాంగ్రెస్ పార్టీలో ఉండే ఉపయోగంలేని కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల మరణానంతరం అయినా పీవీని ఆ పార్టీ ఓన్ చేసుకోవడంలో పరిపూర్ణంగా విఫలమయ్యిందనే అనుకోవాలి! అయితే ఆ తప్పు వైఎస్సార్ విషయంలో జరగకుండా చూసుకుంటుంది నేడు!

నిజంగా పీవీ నరసింహరావుని సొంతం చేసుకోవడంలో.. మా పార్టీ నేత అని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా విఫలమవడంతో… తెరాస ఆ పని పూర్తిచేసుకుంది. మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నాటి కాంగ్రెస్ వదిలేసుకున్నా… తెలంగాణ సెంటిమెంట్ పేరుచెప్పో, ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగానో కానీ… కేసీఆర్ ఆ పని చక్కగా పూర్తిచేస్తున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించడం.. భారతరత్న డిమాండ్ చేయడం వంటివి ఇందులో భాగాలు. దాంతో పీవీ నరసింహారావు.. తెలంగాణ మనిషి అయిపోయారు తప్ప కాంగ్రెస్ పార్టీ మనిషి కాలేకపోయారు. అది పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం!

తగిలిన దెబ్బలు, తగులుతున్న దెబ్బలు నేర్పిన పాఠాల్లో లేక అవసరాలు సృష్టించిన అవకాశాలో తెలియదు కానీ తాజాగా వైఎస్సార్ ను పూర్తిగా ఓన్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తాజాగా… వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించారు. అనంతరం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్సార్ అని కొనియాడారు. వైస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు భారతదేశ వ్యాప్తంగా పాలకులందరూ పాటిస్తున్నారని.. వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని.. రైతులకు, యువతకు, విద్యార్థులకు, మహిళలకు, వైఎస్ రాజశేఖరెడ్డి ఒక ల్యాండ్ మార్క్‌ ని క్రియేట్ చేశారని కొనియాడారు.

దీంతో… ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందేమో కాంగ్రెస్ నేతలు అని కామెంట్లు పడుతున్నాయి. ఎందుకంటే… ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు. అలాంటి వ్యక్తిని సొంతం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు ప్రదర్శించి ఉండాల్సింది. ఢిల్లీ స్థాయిలో కూడా సోనియా, రాజీవ్ లాంటి వారు సైతం ఆయను ఇవ్వాల్సిన స్థాయిలో నివాళులు అర్పించి ఉంటే.. మరింత బాగుండేది! ఏమోలే… ప్రస్తుతానికి రాష్ట్రస్థాయి నేతలు కళ్లు తెరిచారు.. మరి ఢిల్లీ పెద్దలు ఎప్పుడు తెరుస్తారో! ఎంత తెరిచినా ఏపీలో ఛాన్స్ లేదు కానీ… తెలంగాణకి ఏమైనా ఉపయోగపడుతుందేమో చూసుకోవాలనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju