హైదరాబాదు: అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా రసాభాసగా మారింది.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు.
వేదికపై నేతలు కూర్చునే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్ మధ్య గొడవ జరిగింది.
ఒకరినొకరు తోసుకొని.. కుర్చీలో కూర్చునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో విహెచ్, నగేశ్ వేదిక మీదే పరస్పరం బాహాబాహీకి దిగారు. ఈ తోపులాటలో కింద పడ్డారు.
ఆగ్రహానికి గురైన హనుమంతరావు నగేశ్పై చేయిచేసుకున్నారు. ఈ ఘర్షణతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడంతో తెలంగాణ జనసమతి నేత కోదండరామ్తో పాటు ఇతర అఖిలపక్ష నాయకులు వీస్తుపోయారు.
చనిపోయిన పిల్లల కుటుంబాలు ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే గాంధీభవన్లో కొట్లాడుకోండంటూ కాంగ్రెస్ నేతలకు అఖిల పక్ష నేతలు సూచించారు.
ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్ నేతలు కుంతియా, షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె నారాయణ, టిడిపి నేత ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.