Corona Cases: భారత్ లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 8,822 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 15 మంది కరోనా కారణంగా మరణించారు. కరోనా కేసులు ప్రతి రోజు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తొంది. మాస్క్ లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిన్న 5,718 మంది కరోనా బారి నుండి కొలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుండి కోలుకునే వారి శాతం 98.66 గా ఉండటం కొంత ఊరట కల్గిస్తొంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం..మంగళవారం 4.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 8,822 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు 6,594 మంది కరోనా బారిన పడగా, 33 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 53,637కి చేరింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2శాతానికి చేరింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 2,956 మంది కరోనా బారిన పడగా, కేరళలో 1,986, ఢిల్లీలో 1,118 మంది కరోనా బారిన పడ్డారు. మరో పక్క దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్క నాడే 13.58 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.