రోజురోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుంది.. దీనిని దీనిని అరికట్టే భాగంలో మాస్క్ ధరించడం ప్రధాన చర్య.. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా నోరు, ముక్కు ను కప్పి ఉంచేలా మాస్క్ ని ధరించాలి.. ప్రజలకు ఎంత మేరకు చెప్పినా వినక పోవడంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫైన్స్ విధిస్తున్నాయి.. అందులో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.115 కోట్లు జరిమానాగా వసూలు చేసింది..!
ఈ నెల 22 వరకు మొత్తం 23,64,420 మంది ప్రజలకు కు జరిమానా విధించినట్లు ఆ రాష్ట్ర హైకోర్టు నివేదించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 115,88,00,000 జరిమానాను వసూలు చేసినట్లుగా తెలిపింది. ముఖ్యంగా ఇందులో మాస్క్ ను ధరించకుండా, ధరించినా కూడా నోటిని కప్పి ఉంచకుండా, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేబీ పార్ధివాలా లతో కూడిన హైకోర్టు డివిజన్ ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణపత్రం అందించింది. తర్వాత వాయిదా వచ్చేనెల 8కి వేశారు. అంతే కాకుండా మరో వినూత్న శిక్ష విధించింది. సెంటర్లో మాస్కులు కట్టుకొని వారితో తప్పనిసరిగా సామాజిక సేవ చేయాలని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.