హత్య చేసే ముందు ఆ తండ్రీ కొడుకులు ‘దృశ్యం’ సినిమా చూశారు. హత్య తర్వాత పోలీసులను తప్పుదారి పట్టించేందుకు సినిమాలో ఉపయోగించిన టెక్నిక్నే వాడారు. అయినా కటకటాలు తప్పలేదు. మధ్యప్రదేశ్లో ఒక బిజెపి నాయకుడు అతని ముగ్గురు కొడుకులు ప్రస్తుతం ఇండోర్ పోలీసుల కష్టడీలో ఉన్నారు.
బిజెపి నాయకుడు జగదీష్ కరోటియా(65)కు ట్వింకిల్ దాగ్రే(22)తో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కలిసి జీవించాలని పట్టుబడుతున్న కారణంగా కరోటియా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. చివరికి ఆమెను తప్పించాలని నిర్ణయించారు. 2016 అక్టోబర్ 16న ట్వింకిల్ను గొంతు పిసికి చంపారు. తర్వాత ఆమె మృతదేహాన్ని కాల్చేశారు. ఈ హత్యలో నీలేష్ కాస్యప్ అనే వ్యక్తి వారికి సహకరించాడు.
హత్యకు ముందు వారు అజయ్ దేవగన్ హిందీ సినిమా ‘దృశ్యం’ చూశారు. తెలుగులో ఈ సినిమాను వెంకటేష్తో తీశారు.అందులో హీరో చేసినట్లుగా ఒక కుక్క కళేబరాన్ని ఒకచోట పాతిపెట్టి అక్కడ మనిషి శవం ఉందని పుకారు లేవదీశారు. ట్వింకిల్ శవాన్ని కాల్చేసిన చోట పోలీసులకు ఆమె బ్రేస్లెట్, ఇంకా కొన్ని ఆభరణాలు దొరికాయి. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత నిందితులు అయిదుగురినీ పోలీసులు అరెస్టు చేశారు.