తెలుగు రాష్ట్రాలలో లార్జెస్ట్ తెలుగు డైలీ పత్రికగా వెలుగొందుతున్న ఈనాడుకు కరోనా టెన్షన్ పట్టి పీడిస్తుందట. కరోనా లాక్ డౌన్ సమయంలో భారీగా సర్క్యులేషన్ తగ్గిపోవడంతో యాడ్స్ రెవిన్యూ కూడా అమాంతం పడిపోవడంతో కరోనా సాకుగా చూపి సిబ్బంది నీ కుదించారు. పలు జిల్లాలోని ప్రింటింగ్ యూనిట్ లను మూసి వేశారు. జిల్లా ఎడిషన్లను తీసివేశారు.
మరో వైపు కార్యాలయం విధుల్లోకి వచ్చే సిబ్బందికి కరోనా సోకకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొందరు సిబ్బందికి పాజిటివ్ రిపోర్ట్ రావడం వారిలో ఆందోళన కలిగిస్తుందట.
సోమాజీగూడలోని ఈనాడు కాంపౌండ్ లో ఇటీవల సిబ్బందికి సామూహికంగా కరోనా టెస్ట్ లు చేయించినట్లు సమాచారం. సుమారు వంద మంది సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేయించగా వారిలో 17 మందికిపైగా జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయట.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఈనాడు కాంపౌండ్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారుట. శానిటైజర్లు, గ్లోజ్ లు వాడిస్తున్నారుట. చాలా క్లీనింగ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారుట. పాజిటివ్ వచ్చిన సిబ్బందిని హోమ్ క్యారంటైన్ కు పంపినట్లు సమాచారం.
కొందరు జర్నలిస్ట్ లు ఆఫీసులోనే కాక సచివాలయం లో కూడా టెస్ట్ చేసుకున్నారట. అక్కడ మరి కొందరికి పాజిటివ్ రిపోర్ట్ లు వచ్చాయట. ఇదిలా ఉండగా ఆర్ ఎఫ్ సి లో కూడా పరీక్షలు చేయించారనీ, చేయించనున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఆర్ ఎఫ్ సి లో కనుక పాజిటివ్ లు వస్తే అది టాలీవుడ్ కు కలకలంగా మారుతుంది.