జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అయ్యింది. ఎనిమిది మంది సభ్యులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్ధిక సంఘం చైర్మన్ ఎస్ కే సింగ్ ఉన్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుండి అభిప్రాయాలు సలహాలను హై లెవల్ కమిటీ తీసుకోనుంది. కాగా సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రింద తెలిపిన ఏడు అంశాలపై కమిటీ సిఫార్సులు చేయాలని తెలిపారు.
- ఒకే సారి లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ. రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫార్సు చేయాలి.
- .రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా.. కాదా..
- హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫార్సు ఇవ్వాలి.
- ఒకే సారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో విడతల వారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫార్సుయ
- .ఒకే సారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ల ఈ సైకిల్ దెబ్బతినకుండా అవసరమైన చర్యలపై సిఫార్సులు.
- ఒకే సారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి.
- లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు