వృద్ధాప్యం మీద పడిందంటే చాలు వారిని భారంగా భావించే సమాజం ఇది. ఎంతో ప్రేమగా పెంచిన పిల్లలు కనీసం వారిని చేరదీయడానికి కూడా చేతులు రాని పరిస్థితి ఏర్పడింది వారికి. కాని పేదలను, వఈద్దులను ఆదుకోవడానికి ప్రభుత్వం వారికి ఎంతో సహాయ పడుతోంది. మరీ ముఖ్యంగా వృద్దులకు ప్రభుత్వం చేస్తున్న సాయం ఎంతో గొప్పది.
వారి అవసరాల కోసం నెలా నెలా ఇచ్చె పింఛన్ డబ్బులు వారికి ఎంతో అసరాగా నిలుస్తున్నాయి. కాని ఓ కసాయి భర్త ఫించన్ డబ్బులకోసం ఆ వృధ్ధ భార్యను అతి దారుణంగా హతమార్చాడు. కేవలం రూ. 200 లకోసం చంపడానికి కూడా వెనకాడలేని వైనం వెలుగులోచ్చింది. కేవలం 2 వండల కోసం తన భార్యను దారుణంగా చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రు ఊరికి చెందిన మండె సామ్యేలు, ఎఫ్రాయమ్మ(90) దంపతులు నివసించేవారు. భార్య ఎఫ్రాయమ్మకు వృద్ధాప్య పింఛన్ నెలానెలా వస్తుండేది. కాగా 1 న పింఛన్ తీసుకున్న భార్యను భర్త రూ. 200 ఇవ్వాలని కోరాడు. కాని ఎఫ్రాయమ్మ దానికి నిరాకరించింది. దీనితో భర్త సామ్యేలు ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఇంకేముందు భార్యని రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో అదే అదునుగా భావించి ఆమె తపపై కర్రతో కొట్టాడు. తలపై దెబ్బ గట్టిగా తగలడంతో ఎఫ్రాయమ్మ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. దీనితో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.