Ys Jagan Mohan Reddy : పంచాయతీ ఎన్నికలలో మేమంటే మేము విజయం సాధించే మంటూ లోకల్ గా ఉండే డబ్బా చానల్స్ ఎవరికివారు డప్పు కొట్టుకుంటున్న పరిస్థితి.
పంచాయతీ ఎన్నికలలో 36శాతం ఓట్లు రాబట్టినట్లు టిడిపి దాని అనుబంధ మీడియా సంస్థలు…కథనాలు మీద కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఏకంగా చంద్రబాబు.. వైసిపి పతనానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు నాంది అంటూ భారీ డైలాగులు తో తెగ ఊదర కొట్టడం జరిగింది. అయితే లోకల్ మీడియా తీరు ఇలా ఉంటే జాతీయ మీడియాలో మాత్రం జగన్ నినాదం మారుమ్రోగుతోంది. పూర్తి విషయంలోకి వెళితే జాతీయ మీడియా లో మాత్రం పంచాయతీ మొదటి దఫా ఎన్నికల్లో హైయెస్ట్ స్వీప్ చేసినట్లు..ఇండియా టీవీ దగ్గర నుంచి వివిధ నేషనల్ ఛానల్ లకి సంబంధించిన వెబ్ సైట్స్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. 80 శాతానికి పైగా జగన్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు జాతీయ మీడియా ఛానల్స్ వార్తలు ప్రసారం చేయటం విశేషం. ఇదే సందర్భంలో టిడిపి మళ్ళీ జరిగిన పడినట్లు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నిలువరించ లేక పోయినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మొదటి దఫా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మా మిత్ర పక్షం 19 శాతం గెలిచినట్లు చంద్రబాబు పేర్కొనడం జరిగింది. మరి ఆ మిత్రపక్షం ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలలో లోకల్ మీడియా సైలెంట్ గా వైసీపీ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా గానీ జాతీయ మీడియాలో మాత్రం.. జగన్ హవా ఇంకా కొనసాగుతున్నట్లు.. ఏపీలో వైసీపీకి పల్లె ప్రజలు భారీ స్థాయిలో పంచాయతీ ఎన్నికలలో పట్టం కట్టినట్లు ప్రొజెక్ట్ చేయడం జరిగింది.