(విశాఖపట్నం నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)
విశాఖ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ నేడు మృతి చెందారు. ఇటీవలే కరోనా నుండి నుండి ఆయన కోలుకున్నారు. మళ్ళీ శ్రీనివాస్ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు పినాకిల్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కన్నుమూశారు.
కరోనా వైరస్ కారణంగా ఆయనకు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుకోవడం వల్ల 15 రోజులుగా వెంటిలేటర్ తో పాటు ఏక్మొట్రీట్మెంట్ కూడా అందించారు.
విశాఖ వైసీపీ లో క్రియాశీలక నాయకుడైన ద్రోణంరాజు శ్రీనివాస్ వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఉన్నారు. శ్రీనివాస్ తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ మరణానంతరం దక్షిణ నియోజకవర్గ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.