Fire Accident: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బస్సు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఏసీ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పుతున్నా ప్రయాణీకులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద టీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలాన్ని రేపింది. హైదరాబాద్ నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది.
బస్సులో నుండి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ ప్రయాణీకులను అప్రమత్తం చేసి కిందకు దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వెంటనే డ్రైవర్ అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఏసీలో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా అగ్ని మాపక సిబ్బంది ప్రాధమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. మంటల తీవ్రతకు బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NDA Meeting: ఈ నెల 18న ఎన్డ్ఏ కీలక సమావేశం..ఏపీ నుండి ఆ పార్టీకి అహ్వానం..?