Mamata Banerjee: జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి విపక్షాల సత్తా చాటాలని భావిస్తున్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు ముగ్గురు ప్రముఖులు తాము రేసులో నిలబడమని తేల్చి చెప్పేయడంతో మరో సారి సమావేశానికి సిద్ధమవుతున్నారు మమతా బెనర్జీ. తొలుత ఎన్సీపీ నేత శరద్ పవార్ పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించగా ఆయన నిరాకరించారు. ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని గతంలోనే పవార్ స్పష్టం చేశారు. ఆ తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత షరూక్ అబ్దుల్లా కూడా తాను రేసులో ఉండనని ప్రకటించారు. ఈ ఇద్దరు తప్పుకున్న నేపథ్యంలో మహాత్మాగాంధీ, సీ రాజగోపాల్ రెడ్డి మనువడు, బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గోపాలకృష్ణ గాంధీ గతంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక భారత హైకమిషనర్ గా కూడా సేవలు అందించారు. గత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసి వెంకయ్యనాయుడు మీద ఓటమిపాలైయ్యారు. ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీ కూడా విముఖత వ్యక్తం చేశారు. తన పేరును ప్రతిపాదించిందుకు కృతజ్ఞతలు తెలిపిన గోపాలకృష్ణ గాంధీ.. రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసే వ్యక్తి జాతీయ ఏకాభిప్రాయాన్ని కల్పించేలా, ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా ఉండాలన్నారు. అలాంటి వ్యక్తికే అవకాశం ఇవ్వాలని సూచించారు. విపక్షాల వినతిని తిరస్కరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం విపక్షాలు మరో మారు సమావేశం అవ్వాలని నిర్ణయించాయి. శరద్ పవార్ నేతృత్వంలో ఢిల్లీలో విపక్ష నేతల భేటీ జరగనుంది. దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఈ భేటీకి హజరవుతాయని భావిస్తున్నారు. గత వారం సమావేశానికి మమతా బెనర్జీ 22 రాజకీయ పార్టీలకు అహ్వానాలు పంపగా, 16 పార్టీలు హజరైయ్యాయి.