విశాఖపట్నంలోని హిందూస్తాన్ షిప్ యార్డ్ లో దురదృష్టకర సంఘటన గురించి తెల్సిందే. 75 మెట్రిక్ టన్నుల బరువున్న క్రేన్ కుప్పకూలడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెల్సిందే.
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తక్షణమే స్పందించారు. ప్రమాదం గురించి ఆరా తీసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇక హిందూస్తాన్ షిప్ యార్డ్ యాజమాన్యం కూడా ఈ విషయంలో స్పందించింది. ఈ ప్రమాదం దురదృష్టకరమని యాజమాన్యం భావిస్తోంది. బాధిత కుటుంబసభ్యులు, యూనియన్లతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. షిప్ యార్డ్ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. మృతి చెందిన కుటుంబంలో నుండి ఒక సభ్యుడికి ఉద్యోగ అవకాశం కల్పించనుంది. దాంతో పాటు 50 లక్షల పరిహారాన్ని కూడా అందించనుంది.