ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వేదికగా చాలామంది వివిధ రకాలుగా గుర్తింపులు తెచ్చుకుంటూ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇక సెలబ్రిటీలుగా గుర్తింపు కలిగిన వారు… సమాజంలో సహాయార్థం కోసం వేచి చూసే బాధితులకు సహాయం అందిస్తూ చాలామంది సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు తమ పరపతిని మరింతగా పెంచుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉండే నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య విషయంలో కేటీఆర్ అద్భుతంగా స్పందిస్తూ ఉంటారు. ఈ రీతిగా యువత ఫాలోయింగ్ బాగా సంపాదించారు. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ రకంగానే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేస్తూ ఎవరికి కష్టం గురించి అయినా తన దృష్టికి తెలియ వస్తే వెంటనే స్పందిస్తూ వారికి సహాయం చేస్తున్నారు.
ఇటీవల టిడిపి కార్యకర్త ఒకరు అనారోగ్యం పాలైన సమయంలో ఆ కుటుంబానికి ఆపరేషన్ చేయించే డబ్బులు కూడా లేని పరిస్థితి ఉండటంతో వెంటనే ఈ విషయంలో లోకేష్ కలుగజేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అంతేకాకుండా కరోనా పై పోరాడుతున్న జర్నలిస్టులకు బీమా చేయించే విషయంలో కూడా లోకేష్ చాలా చురుకుగా స్పందించారు.
మొత్తానికి అధికారంలో ఉన్న సమయంలో అనేక సార్లు నవ్వులపాలైన లోకేష్ సోషల్ మీడియాలో ఈ రీతిగా వ్యవహరించడంతో లోకేష్ లో ఏంటి ఈ మార్పు అనే చర్చ పార్టీలో నెలకొనగా ..విపక్షాలు లోకేషా ఏంటి ఈ మార్పు నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడానికా అంటూ ఎప్పటిలాగే ఎటకారం అయినా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోపక్క లోకేష్ గతంలో కంటే చాలా భిన్నంగా బరువు తగ్గి తన ప్రసంగాలలో కూడా పరిణితి చెందిన రాజకీయవేత్తగా మాట్లాడటం తో చంద్రబాబు ఈ విషయాలన్నీ గమనిస్తూ చాలా హ్యాపీ గా ఉన్నట్లు టాక్.