Cyber: డబ్బులు అంటే అందరికీ ఆశే.. కానీ డబ్బుల విషయంలో అందులో లాజిక్ ను మర్చిపోతారు చిన్న వస్తువు కొన్నా కూడా లక్షల్లో మనీ ఇస్తామంటే.. ముందు వెనుక ఆలోచించకుండా వాళ్లు చెప్పిన ప్రతి చిన్న పని చేసేస్తుంటాం.. ఇప్పుడు అదే పొరపాటు చేసి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంది ఓ మహిళ..!!
ఓ మహిళా ఈ-కామర్స్ వెబ్సైట్ లో రూ.99 లో ఇయర్ ఫోన్స్ కొంటే ఆమెకు ఫోన్ చేసి 33 లక్షలు కొట్టేశాడు ఓ కేటుగాడు. వాళ్ళ అమ్మాయి ఆన్లైన్ క్లాసులు కోసం ఇయర్ ఫోన్స్ కొనాలనుకుని ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్నీ పరిశీలించి.. రూ.99 లో ఇయర్ ఫోన్స్ కొనింది. ఆమెకు కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరు షాపింగ్ చేసిన కూపన్స్ కి లాటరీ తగిలిందని.. రూ 15 లక్షల విలువైన కారు బహుమతిగా వచ్చిందని చెప్పాడు. కొన్ని ఈ ప్రక్రియను పూర్తి చేయగానే మీ ఇంటికి కారు పంపిస్తామని కారు వద్దనుకుంటే.. దానికి తగిన నగదును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాము అని చెబుతాడు.
ఆ కేటుగాడి మాటలు నమ్మిన మహిళ తనకు డబ్బులు కావాలని చెబుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో సుమారు 33 లక్షల వరకు తన అకౌంట్లో జమ చేయించుకున్నాడు. ఆ డబ్బులన్ని రిఫండబుల్ అని చెప్పడంతో.. ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు.. వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సి పి ఆదేశాలతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు నిందితుడిని పట్టుకొని రూ.3.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అతని బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ.29 లక్షల ను ఫ్రీజ్ చేశారు. నిందుతుడు దగ్గర ఉన్న ఫోన్స్, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు, బ్యాంక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.