IND v ENG : ఇంగ్లాండ్ తో రేపటి నుండి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇక తుది జట్టు లో ఎవరు చోటు సంపాదిస్తారు అనే విషయంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ లే భారత ఓపెనింగ్ జోడి అని తెలియజేశాడు.
దీనిని బట్టి ఫామ్ లో లేని కె ఎల్ రాహుల్ మరి కొద్ది రోజులు బెంచ్ కే పరిమితం కావచ్చని చెప్పవచ్చు. ఇక కోహ్లీ మూడో స్థానంలో దిగేది కూడా కన్ఫర్మ్ అయిపోయినట్లే. అలాగే ఈసారి జట్టులోకి డాషింగ్ వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ 5 నెంబర్ బ్యాట్స్మెన్గా ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రెగ్యులర్ పేసర్ బూమ్రా లేకపోవడంతో భువనేశ్వర్, నటరాజన్ కొత్త బంతిని పంచుకోవచ్చు. అలాగే శార్దూల్ ఠాకూర్ కూడా తుది జట్టు లో ఉండేది దాదాపు ఖాయమే. యుజ్వేంద్ర చాహల్ ప్రధాన స్పిన్నర్ గా టీం లోకి వస్తాడు.