Lock Down : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ చేపట్టే దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు ఇటీవల బాగా వస్తున్న సంగతి తెలిసిందే. పక్కనే మహారాష్ట్రలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు… రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరస్ లు అయ్యాయి.
దీంతో వస్తున్న వార్తలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ స్పందించండి. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ అనే వార్తలలో వాస్తవం లేదని తెలిపారు. లాక్డౌన్ వల్ల సామాన్యుల జీవితాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్థికంగా నష్టపోతున్నారని అటువంటి ఆలోచన లేదని తెలిపారు. కేవలం రాష్ట్రంలో స్కూల్స్ మరియు కాలేజీల విషయంలో మాత్రమే అది కూడా కొద్ది రోజులు మాత్రమే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని .. తెలిపారు. వీకెండ్ లాక్ డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ హోం శాఖ మంత్రి మహ్మద్ ఆలీ క్లారిటీ ఇచ్చారు.