IND vs ENG : మొదటి టీ-20లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత జట్టు రెండవ టీ 20 లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. సొంత గడ్డపై భారత్ చాలా బలమైన ప్రత్యర్థి. అయితే ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా ఇంగ్లాండ్ ఎంతో సునాయాసంగా తొలి టీ-20 గెలిచిన తర్వాత భారత్ నుండి అదే రేంజ్ లో ఫైట్ ను ఆశిస్తోంది. ఇదే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన తీవ్ర విమర్శలు రావడం మొదలయ్యాయి.
ఫామ్ లో ఉన్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ కు రెస్ట్ ఇవ్వడమే తొలి టీ20లో టీమిండియా కొంపముంచింది అని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్ శర్మ పై పనిభారం, ఒత్తిడి ఎక్కువ కావడం వల్లే అతనికి ఇవ్వాల్సి వచ్చిందని కోహ్లీ చెప్పాడు. ఇక రెండవ టీ-20 ఇటువంటి అతి కీలకమైనది కాబట్టి జట్టులో రోహిత్ శర్మ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని మీడియా వర్గాలు తెలిపాయి. రోహిత్ శర్మ టీమ్ లోకి వస్తే శిఖర్ ధావన్ కు బెంచ్ పరిమితం కావాల్సి ఉంటుంది… లేదంటే కె.ఎల్.రాహుల్ నాలుగవ స్థానంలో వచ్చి భారత్ ఒక బౌలర్ ను కోల్పోవాల్సి వస్తుంది.
అప్పుడు హార్దిక్ పాండ్యా కచ్చితంగా నాలుగు ఓవర్లు వేయాలి. ఇప్పుడు రోహిత్ శర్మ ఉంటాడా లేదా అన్న విషయం పై తీవ్ర సందిగ్దత నెలకొంది. హార్దిక్ పాండ్యా కచ్చితంగా నాలుగు ఓవర్లు వేయవలసి వస్తే అది ఇంగ్లాండ్ జట్టుకు కొద్దిగా కలిసి వచ్చే అంశమే. పైగా రోహిత్ శర్మ జట్టు లోకి వచ్చి ధావన్ కూడా ఉంటే టీం బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ గొడవంతా ఎందుకు మొదటి టీ20లో ఆడిన జట్టుని కొనసాగించాలని రవిశాస్త్రి బృందం భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అయితే రోహిత్ శర్మ అభిమానులు, అటు భారత్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం శర్మ వస్తేనే టీమ్ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి…