Pawan Kalyan : జనసేన పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు కావటంతో..పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాదులో పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్.. బిజెపి పార్టీ పై కాంట్రవర్సి కామెంట్ చేయటం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేంద్ర బిజెపి నాయకత్వంతో జనసేన పార్టీ కలిసి పని చేసింది కానీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాత్రం చాలా పూర్తి విరుద్ధంగా వుంది అని, జనసేన పార్టీని చులకన చేసి మాట్లాడే తరహాలో తెలంగాణ బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీకూతురికి మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు.. దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని, ఆర్థికంగా దేశాన్ని దిశానిర్దేశం చేసిన వ్యక్తి. అటువంటి మహనీయుడు కూతురికి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంమీద చూసుకుంటే తెలంగాణ బిజెపి ని కార్నర్ చేసి పవన్ తీవ్రస్థాయిలో చురకలంటించారు.
ఇదిలాఉంటే ఇటీవల ఏపీ బిజెపి పార్టీకి చెందిన టీజీ వెంకటేష్ కూడా… బీజేపీకి మసాలా కొంచెం కావాలి, అది పవన్ కళ్యాణ్ అంటే అందుతుంది అన్నట్టు.. జనసేన కూరలో కరివేపాకు అన్నట్టుగా కామెంట్లు చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ బిజెపి ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయటం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.