ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి బయోపిక్ ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాని అధికారకంగాను కోన వెంకట్ ప్రకటించాడు. కోన వెంకట్, ఎం.వి.వి సత్యనారాయణ కలిసి నిర్మిస్తుండగా సంజనా రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
అయితే ఈ బయోపిక్ టైటిల్ రోల్ లో నటించే హీరోయిన్ ఎవరన్నది ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి డైలమాలో ఉన్నారు. ఇప్పటికే కరణం మల్లేశ్వరి ని మ్యాచ్ చేసే పర్సనాలిటీ ఏ హీరోయిన్ కి ఉంది అని మేకర్స్ చాలామందిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కోన వెంకట్ టైటిల్ రోల్ ను తాప్సి తో చేయించాలని ముందు అనుకున్నారు. కాని తాప్సీ బాలీవుడ్ లో వరసగా సినిమాలు కమిటవడంతో డేట్స్ సర్ధుబాటు చేయలేకపోయిందట. దాంతో అక్కినేని సమంత పేరు ప్రచారంలోకి వచ్చింది.
అందుకు కారణం వెయిట్ లిఫ్టింగ్ లో సమంత కి బాగా పట్టుంది. రెగ్యులర్ గా సమంత వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. దాంతో కరణం మల్లేశ్వరి పాత్రకి సమంత పర్ఫెక్ట్ అని భావించారట మేకర్స్. కాని సమంత ఈ బయోపిక్ మీద ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెర మీదకి రకుల్ పేరు వచ్చింది. రకుల్ కి సొంత జిం సెంటర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తను కూడా ఫిట్నెస్ మీద చాలా శ్రద్ద చూపిస్తుంటుంది. వేయిట్ లిఫ్టింగ్ లో రకుల్ కూడా పట్టుంది. అందుకే కరణం మల్లేశ్వరి బయోపిక్ కి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవాలని చూస్తున్నట్టు తాజా సమాచారం.