ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధవన్ సెంటర్ షార్ నుండి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ – ఎఫ్ 14 రాకెట్ .. ఇన్సాట్ – 3 డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.
2,275 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్ – 3 డీఎస్ ను వాతావరణ పరిశీలనలను మెరుగుపర్చడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి ఊపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థ మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్ – 3 డీ, ఇన్సాట్ – 3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పని చేస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.
గతంలో ప్రయోగించిన ఇన్సాట్ – 3, ఇన్సాట్ – 3డీఆర్ ఉప గ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సాట్ – 3డీఎస్ ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ (జీటీవో)లో శాటిలైట్ ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజుల పాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి మారుస్తారు.
TS Assembly: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ..అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేతపత్రంపై వాడివేడిగా వాదనలు