Jati ratnalu : జాతిరత్నాలు. Jati ratnalu.( నేడు గురువారం ) మహాశివరాత్రి పండుగ సందర్భంగా విడుదలై ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుటున్న తాజా చిత్రం. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఏజెంట్ శ్రీనివాస సాయి ఆత్రేయ సినిమాతో క్రేజ్ సంపాధించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఇప్పుడు జాతి రత్నాలు సినిమాలో మరోసారి అద్భుతమైన పాత్రలో కనిపించగా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాతో మరో లెవల్ కి నవీన్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించగా.. స్వప్న సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు.
మొదటి షో నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్ళ పై అంచనాలు బాగానే పెరిగాయి. ఇక జాతి రత్నాలు సినిమాని ప్రమోట్ చేసి ప్రభాస్ ఈ సినిమా పై అంచనాలని పెంచారనుకుంటే మరో హీరో హీరోయిన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అందరికి పెద్ద సర్ప్రైజెస్ ఇచ్చారు. వారు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. ఈ ఇద్దరు ఇంతక ముందు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ కోరిక మేరకే ‘జాతిరత్నాలు’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ లో ప్రేక్షకులని కనువిందు చేసారు. ఇక నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ముగ్గురూ విజయ్ దేవరకొండ కి చాలా సన్నిహితులు. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా గెస్ట్ గా హాజరయ్యాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణం.
Jati ratnalu : ఫస్ట్ హాఫ్ లో కీర్తిసురేష్ .. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ..!
జాతి రత్నాలు సినిమా ఫస్ట్ హాఫ్ లో కీర్తిసురేష్ .. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తారని ఏ ఒక్కరు ఊహించలేదు. మేకర్స్ కూడా ఈ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారు. అదే ఇప్పుడు ప్రతీ ప్రేక్షకుడికి భారీ సర్ప్రైజ్ అయింది. వెరైటీ ప్రమోషన్స్ తో రిలీజ్ కి ముందే బజ్ క్రియేట్ చేయడమే కాక గెస్ట్ అప్పీరియన్స్ లో కీర్తిసురేష్ ని, విజయ్ దేవరకొండని ప్రెజెంట్ చేసి జాతిరత్నాలు సినిమాను ప్రేక్షకులలో కి దూసుకు వెళ్ళెలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. మల్టీ స్టారర్ సినిమాలకి క్రేజ్ ఉన్న సమయంలో ఇలాంటి గెస్ట్ అప్పీరియన్స్ పాత్రలతో ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు మన మూవీ మేకర్స్. ఇది అన్ని విధాల సినిమా సక్సస్ కి ఉపయోగపడుతోంది. మొత్తానికి సినిమాకి సక్సస్ టాక్ రావడంతో మేకర్స్ ఆనందంలో ఉన్నారు.