ముంబాయి:ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కోరిక ఏమిటో మీకు తెలుసా. ఆమె కోరిక వింటే అందరూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం భారత్ సినిమాకు ప్రచారంలో బిజీగా ఉన్న కత్రినా ఇటీవల ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.
జీవించి ఉన్న లేక చనిపోయిన వారిలో ఎవరితో డిన్నర్ చేయాలని మీ కోరిక అని ఆ విలేఖరి అడిగిన ప్రశ్నకు మార్లిన్ మన్రో, నరేంద్రమోది, కండోలినా రైస్లతో అని కత్రినా సమాధానం ఇచ్చింది.
ఈ లిస్ట్లో నేను లేనా అంటూ సల్మాన్ ఖాన్ కల్పించుకొని అడిగారు. దానికి కత్రినా మాట్లాడుతూ మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి నటించినా ఇప్పటి వరకూ కలిసి డిన్నర్ చేయలేదని సమాధానమిచ్చింది. దీనిపై సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ కత్రినా డిన్నర్ సాయంత్రం ఆరున్నరకే అయిపోతుంది, అపుడు నేను లంచ్ చేస్తాను అని ఫన్నీగా చెప్పారు.