Lata Mangeshkar : గానకోకిల.. దేశ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబై లో జరిగాయి.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆమె భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. నివాళులర్పించిన తర్వాత లతా మంగేష్కర్ కుటుంబీకులు, వైద్యులతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య, మంత్రి ఆదిత్యతో కూడా మోడీ కాసేపు సంభాషించారు.
మోడీతో పాటూ లతా పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ, మంత్రి ఆదిత్య, సీఎం ఉద్ధవ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బిగ్ బీ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె పాటలను తలచుకుని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. రేపు, ఎల్లుండి దేశం మొత్తం మీద సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనేక రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయి.