Radhe shyam: డార్లింగ్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ పిరియాడిక్ డ్రామా అయినటువంటి ‘రాధేశ్యామ్’ ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి విదితమే. దాదాపు మూడున్న రేళ్లుగా ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు తెరదించులూ ‘రాధేశ్యామ్’ మార్చి 11న అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదలై, రికార్డు స్థాయి వసూళ్లతో ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో ఈ మూవీలో నటించిన నటీనటులపై కొన్ని కామెంట్ లు వినిపిస్తున్నాయి.
Radhe Shyam: ప్రభాస్ ఇమేజ్ను పక్కన పడేసి పక్కా వాళ్ళకోసమే తీశారా..?
Radhe shyam: ఎక్కువగా వినబడుతుంది ఇదే?
దాదాపు 300 కోట్లు ఖర్చు చేసిన మేకర్స్ దీనికి పాన్ ఇండియా లుక్ రావాలని ఇతర భాషల్లోని పాపులర్ నటీనటుల్ని ప్రత్యేకంగా ఈ మూవీ కోసం ఎంపిక చేశారు. గాని ఏస్థాయిలో వారిని ఉపయోగించుకోలేదని కొందరు పెదవి విరుస్తున్నారు. జగపతిబాబు మొదలుకొని సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, జయరామ్, కునాల్ రాయ్ కపూర్, మురళీశర్మ, సత్యన్ వంటి వారిని ఎంపిక చేసినప్పటికీ ఎవరి పాత్రలకూ సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వారిని ఎంపిక చేసుకోవడం వల్ల సినిమాకు ఒరిగింది ఏమీ లేదని అంటున్నారు.
Radhe Shyam: బాలీవుడ్ ఖాన్ లకి షేక్ చేస్తున్న ప్రభాస్ కలెక్షన్ లు..!!
అదే లోపంగా మారిందా సినిమాకి?
ఒక్క ‘సచిన్ ఖేడేకర్’ పాత్ర తప్ప మిగతా వాళ్లు సినిమాకు ఏ రకంగానూ ఉపయోగ పడలేదని కొంతమంది క్రిటిక్స్ చెబుతున్నారు. ఇకపోతే ఇతర భాషలకు చెందిన పెద్ద పెద్ద నటుల్ని సినిమాకు తీసుకున్నా వారికి ఆశించిన స్థాయి పాత్రలని ఇవ్వకపోవడం వల్ల ప్రాజెక్ట్ కి వారే మైనస్ గా మారారని అంటున్నారు. ఎంత ఇతర భాషలకు చెందిన బడా నటుల్ని తీసుకున్నా, వారిని అనుకున్న స్థాయిలో ఉపయోగించుకుంటేనే సినిమాకు బలంగా నిలుస్తారు. వారు మాత్రం ఏం చేస్తారు… కానీ ఈ విషయంలో ‘రాధేశ్యామ్’ టీమ్ విఫలమైందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.