Radhe Shyam: ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి వస్తే బాలీవుడ్ గురించి ప్రపంచ సినీ ప్రేమికులు మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయిందా భారతదేశంలో మరియు విదేశాలలో ప్రభాస్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. బాలీవుడ్ గురించి మాట్లాడుకున్నా … ఎక్కువగా షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ … ఈ ముగ్గురు ఖాన్ త్రయాలా గురించే చర్చించుకునే వాళ్ళు.
రికార్డులు కూడా వీరి పేరిట నమోదు అయ్యే పరిస్థితి ఉండేది. ఇదిలా ఉంటే ఇంకా ప్రభాస్ రంగంలోకి దిగక బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు “బాహుబలి”తో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఈ క్రమంలో లో ప్రభాస్ రికార్డులు బద్దలు కొట్టడానికి ముగ్గురు ఖాన్ లు… తమదైన శైలిలో అనేక ప్రయత్నాలు చేస్తున్న ఎక్కడ వర్క్ ఔట్ కావడం లేదు. ఇటువంటి తరుణంలో తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యాం రిలీజ్ కావడం తెలిసిందే.
భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు 79 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు.. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్లేదని ట్రేడ్ వర్గాల టాక్. ముఖ్యంగా కరోనా పాండమిక్ తర్వాత హైయెస్ట్ గ్రాసర్ గా.. 74 కోట్లు కలెక్ట్ చేయడం తో ప్రభాస్ మాస్ ముందు… ఖాన్స్… బచ్చాలు అయిపోయారు… అన్నట్టు తాజా కలెక్షన్లపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో… తనకంటూ తిరుగులేని మార్కెట్ సొంతం చేసుకోవడంతో… చాలావరకు మనోడు సినిమాలకు మొదటి రోజే సగం డబ్బులు వచ్చే పరిస్థితి నెలకొంది.