సింగర్ సునీత రెండో వివాహం ఇటీవల శంషాబాద్ రామాలయం లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలలో స్పెషల్ ఎట్రాక్షన్ సునీత ఇద్దరు పిల్లలు అని చెప్పవచ్చు.రామ్ వీరపనేని అనే బడా పారిశ్రామికవేత్త తో సునీత చేసుకున్న వివాహానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
కాగా ఈ వివాహ వేడుకలలో సునీత కూతురు శ్రేయ కొద్దిగా ఎమోషనల్ అవ్వడం అందరికీ కొంత కంటతడి పెట్టించింది. మొదటి భర్త కిరణ్ అనే వ్యక్తితో మనస్పర్థలు రావడంతో సునీత దశాబ్దం క్రితం అతనితో విడిపోయి ఒంటరిగా జీవనం సాగిస్తూ తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఇదే టైమ్ లో తన ఇద్దరు పిల్లల సంరక్షణ కూడా చూసుకుంటున్నారు.
అయితే తాజాగా సునీత రెండో వివాహం కావటంతో.. పిల్లలిద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే రెండో పెళ్లి అయిన వెంటనే ఈ కొత్త జంట ప్రైవసీ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే మీడియాకి అదేవిధంగా ఫోన్ ప్రపంచానికి దూరంగా ఉండి ఈ నెలాఖరు వరకు భర్తతో కలిసి హనీమూన్ వెళ్లే ప్లాన్ లో సునీత ఉన్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. సోషల్ మీడియా కి కూడా దూరంగా ఉండాలని సునీత నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. సో ఈ నెలాఖరు వరకూ ఫ్యాన్స్ కు దర్శనం ఇవ్వదు అని తెలుస్తోంది.