Space Wonder: ఆకాశంలో జరిగే చర్యల గురించి పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. గ్రహశకాలాలు, గ్రహాల కదలికలు వాటి వలన భూమిపైన ప్రభావం ఎలా ఉండబోతుందనే విషయాలపై శాస్త్రవేత్తలు శాస్త్రీయ పరిశోధనలు చేస్తుంటారు. కాగా, ఈ నెల 19న ఈ శతాబ్దపు అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నదని పరిశోధకులు తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ వారు ఈ మేరకు ప్రకటన చేశారు.
శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం(Partial lunar eclipse)
నవంబర్ 19న అనగా కార్తీక పౌర్ణమి నాడు ఆకాశంలో సుదీర్ఘమైన (longest) పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతున్నట్లు నాసా పరిశోధకులు తెలిపారు. ఈ చంద్రగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యద్భుతమైనదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18, 19 తేదీల్లో వివిధ టైమింగ్స్లో ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించొచ్చు.
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం..
ఇండియన్ టైమింగ్స్ ప్రకారం.. ఈ నెల 19న మధ్యాహ్నం 1.30 గంటలకు సుదీర్ఘమైనటువంటి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని అంతరిక్ష పరిశోధకులు తేల్చారు. సుమారు 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్రగ్రహణం వల్ల చంద్రుని ఉపరితలం అంతా రెడిష్ అయిపోతుందట. దాంతో చంద్రుడు మొత్తంగా రెడ్ కలర్లోనే కనిపించే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఈ చంద్రగ్రహణం ఈ ఏడాదికి చివరిది. కాగా, తొలి చంద్రగ్రహణం మే 26వ తేదీన ఏర్పడింది. ఇది కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ కాగా, ఆ రోజున చంద్రుడు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. అలా చంద్రుడు మొత్తంగా రెడ్ కలర్లో కనిపించడాన్ని ‘సూపర్ మూన్(Super Moon)’ అని అంటారు. ఇకపోతే భారతదేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు, ఈ నెల 19న ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. వచ్చే 80 ఏళ్లలో అనగా 2021 నుంచి 2030 మధ్య మొత్తం 20 సంపూర్ణ, పాక్షిక, గ్రహణాలు ఏర్పడొచ్చని ‘నాసా(NASA)’ పేర్కొంది. కాగా, 2021 నుంచి 2100 మధ్య అనగా ఈ శతాబ్ద కాలంలో అత్యంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఈ నెల 19న ఏర్పడబోయేది కావడం గమనార్హం.