కరోనా బారిన పడ్డ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ 11 రోజుల తర్వాత ఈరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జులై 25న చౌహన్ కు కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఎప్పటినుండో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చౌహన్ ఈరోజు ఇంటికి వెళ్లారు.
గత 10 రోజుల నుండి ముఖ్యమంత్రికి ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసారు. అయితే శివరాజ్ సింగ్ చౌహన్ మరో వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని సూచించారు. ఈ వారం రోజులు ఆరోగ్య స్థితిని అంచనా వేసిన తర్వాత పూర్తిగా కోలుకున్నట్లు భావించవచ్చు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహన్ తనకు వైద్యం అందించిన వైద్యులకు కృతఙ్ఞతలు చెప్పారు. ప్రజలు కంగారు పడాల్సిన పని లేదని, జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ఫాలో అయితే సరిపోతుందని చెప్పారు.