ముంబాయి, జనవరి 23: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో తొమ్మిది మందిని మహరాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎటిఎస్ సిబ్బంది థానె, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి పేలుళ్లకు ఉపయోగించే వస్తువులు, సిమ్ కార్డులు తదితర పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ఉగ్రవాద సంస్థ ఐఎస్తో సంబంధాలు ఉన్నట్లు స్క్వాడ్ అధికారులు భావిస్తున్నారు. వీరిని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు. స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నవారి వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
previous post
next post