సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ డెహ్రా డూన్, అమెరికా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న మహర్షి, ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ కోసం పొల్లాచి వెళ్లాడు. సినిమాకి అతిముఖ్యమైన రైతుల బ్యాక్ డ్రాప్ లోని సీన్స్ ఇక్కడ షూట్ చేస్తారు. పొల్లాచి షెడ్యూల్ తో దాదాపు 75% షూటింగ్ పూర్తి చేసుకునే ఈ సినిమా, నిజానికి ముందు చెప్పిన డేట్ ప్రకారమైతే ఏప్రిల్ 05న విడుదల కావాలి కానీ మహర్షి వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
ఇప్పటి జరిగిన మూడు షెడ్యూల్స్ లో అక్కడక్కడా కొంచెం ప్యాచ్ వర్క్ బాలన్స్ ఉండడం, షెడ్యూల్ డిలేస్ జరగడం కారణంగా మహర్షి అనుకున్న సమయానికి విడుదల కావట్లేదు. ఎప్పటినుంచో రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ పెట్టుకొని ఏప్రిల్ 5కి రచ్చ చేయాలనుకున్న మహేశ్ ఫ్యాన్స్, మహర్షి వాయిదా పడిందనే వార్త బయటకి రావడంతో పూర్తిగా డీలా పడ్డారు.
మహర్షి డిలే న్యూస్ బయటకి వచ్చి నిరాశచెందిన ఘట్టమనేని అభిమానులకి చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఒక హ్యాపీ న్యూస్ చెప్పారు. రీసెంట్ గా సంక్రాంతికి ‘ఎఫ్2’ సినిమా రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు, ఎప్పటిలాగే తన మూవీ రిలీజ్ తర్వాత తిరుపతి వెళ్లి వెంకన్న స్వామిని దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మహర్షి సినిమా ఏప్రిల్ 25న విడువులవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఘట్టమనేని అభిమానులు, సోషల్ మీడియాలో మహర్షి హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్వీట్ల మోత మోగించారు. గతేడాది ఏప్రిల్ లోనే భరత్ అనే నేను సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న మహేశ్, మరోసారి ఈ ఏప్రిల్ హిస్టరీ రిపీట్ చేసి భరత్ అనే నేను రికార్డ్స్ బ్రేక్ చేస్తారేమో చూడాలి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!