Mahesh Babu: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పూర్తయింది. వెంటనే మరో సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఎప్పుడు మొదలు పెట్టాల్సి ఉండగా కరోనా వల్ల ఆలస్యం అవుతుంది. పాత్రలు చేస్తున్నారు చివరికి సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
స్క్రిప్ట్ ను పూర్తిచేసిన త్రివిక్రమ్ నటీనటుల విషయంలో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరు మహేష్ బాబు కి జంటగా ఎవరు చేస్తారు అనే విషయంపై ఒక స్పష్టత వచ్చింది. కానీ అధికారికంగా ఇంకా ఆ విషయం బయటకు చెప్పలేదు. మహేష్ బాబు పాత్రకు ధీటుగా మరో స్టార్ హీరో ని విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
మంచు హీరో మోహన్ బాబు ను ఈ చిత్రంలో నటింపచేయాలని జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. కీలక పాత్రకు మోహన్ బాబు ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మోహన్ బాబు ని త్రివిక్రమ్ కలిసి ఈ సినిమా గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. కానీ మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు చేయడం లేదు, సన్ ఆఫ్ ఇండియా అనే ఒక సినిమాలో ఆయన చేస్తున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల ఆలస్యం అయిన ఆ సినిమా చివరకు చేరుకుంది. ఆ సినిమా విడుదల త్వరలోనే కానుంది.
మహేష్ బాబు కి మామయ్య పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారు. మోహన్ బాబు ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తీసుకున్నవారు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి విజయాన్ని దక్కించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
మోహన్ బాబు కూడా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఆశపడుతున్నారు. యమదొంగ సినిమాలో రాజమౌళి మోహన్ బాబు కి యముడి పాత్ర ఇచ్చారు. అది ఆ సినిమాలో చాలా కీలకమైన పాత్ర. అలానే త్రివిక్రమ్ కూడా ఇప్పుడు రాజమౌళి ని ఫాలో అవుతున్నాడా?