సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్ కేసు వైపు టర్న్ తీసుకున్న విషయం తెల్సిందే. సుశాంత్ ప్రియురాలు డ్రగ్స్ తీసుకుంటోందని రుజువవ్వడమే కాక సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక విచారణలో రియా 25 మంది ప్రముఖ బాలీవుడ్ కు చెందిన పేర్లను వెల్లడించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ కేసులో శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో వారు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అదే కోవలో దీపికా మేనేజర్ కరిష్మాకు సమన్లు అందాయి. ఇక దీపికాకు కూడా సమన్లు త్వరలో పంపడానికి రంగం సిద్ధమైంది. ఇదిలా ఉండగా ఇప్పుడీ కేసులో నమ్రతా శిరోద్కర్ పేరు వచ్చింది. ప్రముఖ నేషనల్ మీడియా చానళ్ళు ఇండియా టుడే, ఆజ్ తక్ నమ్రత శిరోద్కర్ పేరును ఈ కేసుకు లింక్ చేస్తూ ప్రస్తావించాయి. టాలెంట్ మేనేజర్ జయ్ షా తో మహేష్ భార్య నమ్రత ఛాటింగ్ చేసినట్లు ఈ నేషనల్ మీడియా చానళ్ళు కథనాలు వెల్లడించాయి.