Maruti Suzuki : ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రెండ్ నడుస్తోంది.. కార్, బైక్, స్కూటర్, ట్రాక్టర్, ఆటో రిక్షా, సైకిల్ వరకు అన్ని ఎలక్ట్రిక్ ఉత్పత్తులే.. భారతీయ మార్కెట్లోకి Maruti Suzuki మాత్రమే ఎలక్ట్రిక్ ప్రవేశపెట్టలేదు.. కొత్తగా ఓ వ్యక్తి మారుతీ సుజికి ఎలక్ట్రిక్ ప్రయోగం చేశాడు.. ఈ డిజైర్ వాహనం 2020 ఫిబ్రవరి మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం గా మార్చేశాడు.. చాల రెగ్యులర్ స్టాండర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్చిన నార్త్ వే మోటార్ స్పోర్ట్ కంపెనీయే ఎలక్ట్రిక్ వెహికల్ గా మార్చింది..
టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ మోడల్ ఇంకా సర్టిఫికెట్ మాత్రమే పొందాల్సి ఉంది. ఇంకా ఎలక్ట్రిక్ వాహనం గా మార్చేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ కార్ లో 15 కిలోవాట్స్ మోటార్ అమర్చారు. వినియోగదారుల అవసరం మేరకు మరో 35 కిలోవాట్స్ మోటార్ వరకు పెంచుకోవచ్చు. ఆ మోటార్ సాయంతో 170 ఎన్ ఎమ్ టర్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఇందులో 13 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను 15KWH వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు.ఇంకా మిగిలి ఉన్న స్పేస్ లో మరో బ్యాటరీ ప్యాక్ ను యాడ్ చేసుకుని 18KWH కెపాసిటీ వరకు పెంచుకోవచ్చు.
దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఈ కార్ లో 3టన్నుల బరువు వేసినప్పటకీ ఇది కదులుతుంది. 0 – 100 శాతం చార్జింగ్ అవ్వాలంటే 8 గంటల పాటు సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పద్ధతి కోసం వాళ్ళు ట్రై చేస్తారు.. ఈ కార్ బరువు 950 కేజీలు. ఇందులో జనరల్ గా ఉన్న ఫంక్షన్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి. పవర్ స్టీరింగ్, అన్నీ కంట్రోల్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఈబిడి, క్లస్టర్, పెడల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.