ఢిల్లీ,జనవరి 21: దేశం నుండి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. తన ఇండియన్ పాస్పోర్టు(జె-3396732)ను అంటిగ్వాలో అధికారులకు అప్పగించాడు.
పంజాబ్ నేషనల్ బ్యాంకునుండి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన కుంభకోణం విషయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ ఆయనపై విచారణ జరుపుతున్నాయి. ఈ విచారణను అడ్డకునేందుకు ఆయన పాస్పోర్టును అప్పగించినట్లు అధికారులు భావిస్తున్నారు. అంటిగ్వాలోని భారత హైకమిషన్లో అతను పాస్పోర్టుతోపాటుగా 177 డాలర్లను అందజేశాడు.
పిఎన్బిలో మోసాలకు పాల్పడిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీవర్ మోదీకి ఛోక్సీ మామ అవుతారు. వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ అంటిగ్వా దేశంలో ఉన్నారు. ఆయనకు 2017లో అంటిగ్వా-బార్బుడా పౌరసత్వం మంజూరు కాగా 2018 జనవరి 15 పాస్పోర్టును పొందారు. అక్కడి నిబంధనల ప్రకారం రెండు దేశాల పౌరసత్వాలు ఉండటానికి వీలులేదు. దీంతో భారత పౌరసత్వాన్ని ఆయన తిరిగి ఇచ్చివేశాడు.
గత ఏడాది జనవరిలో నిందితుల ఇద్దరి మోసాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటికే వారు దేశం విడిచి పారిపోయారు. పిఎన్బిని సుమారు 13వేల కోట్ల రూపాయలకు మేర వారు మోసం చేసినట్లు ఈడి దర్యాప్తుల్లో వెల్లడైయింది. విదేశాల్లో ఉన్న వీరిద్దరినీ భారత్కు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది జనవరి 29న నిందితులిద్దరిపైన కేసులు నమోదయ్యాయి.
previous post
next post