ఎట్టకేలకు మొదటి లగ్జరీఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. బెంజ్ కారు మార్కెట్లోకి వస్తుందంటే వాహన ప్రియుల చూపులు ఆ వాహనంపైనే ఉంటుంది. లగ్జరీ కార్ల ఉత్పత్తిలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రముఖ వాహన సంస్థ మెర్సిడెజ్ బెంజ్ తన ఈక్యూసీ ఎలక్ట్రిక్ ఎస్ యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ లో విడుదలైన తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్ యూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది.
దీని ఎక్స్ షోరూం ధర 99 లక్షల 30 వేల రూపాయలు. ఇతర పన్నులతో కలిపి ఆన్ రోడ్ ధర కోటి రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ ధర మొదటి 50 కార్లకు మాత్రమే పరిమితం చేయబడింది. తరువాత దీన్ని ధర మరింత పెరగవచ్చు.
మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంది. ప్రతి ఎక్సెల్ ఒక్కో మోటార్ ను అమర్చారు. 4-వీల్ డ్రైవ్ సిస్టంతో పాటు 80 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ బ్యాక్ ను కలిగి ఉంది. ఇది కాకుండా మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ 405 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 765 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా సింగిల్ ఛార్జింగ్ 471 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.1 సెకండ్లలోనే అందుకుంటుందని కంపెనీ చెప్పింది. గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాకుండా కేవలం 40 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది.
సరికొత్త లగ్జరీ ఎస్ యూవీ డిజైన్ విషయానికొస్తే జీఎల్సీ ఎస్ యూవీ మాదిరే ఉంది. ఫ్రంట్ గ్రిల్, అతిపెద్ద త్రీ పాయింటెడ్ స్టార్, స్టైలిష్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, డబుల్ అప్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్ ను కలిగి ఉంది. ఇవికాకుండా ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ స్ట్రిప్ రన్నింగ్ ఎక్రాస్ విడ్త్ బూట్ ను కలిగి ఉంది. దీనిలో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇందులోని డ్యూయల్ టోన్ 10.3 అంగుళాల డిస్ ప్లే, ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, ఇవేకాకుండా ఎంబీయూఎక్స్ కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి తదితర ఫీచర్లను కలిగి ఉంది.