అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి తన వంతు కృషి చేస్తానని ఏపిఐఐసి చైర్మన్గా నియమితురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. సోమవారం ఏపిఐఐసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రోజా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని రోజా అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని రోజా తెలిపారు. పారిశ్రామికీకరణకు బడ్జెట్లో ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని రోజా గుర్తు చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే సిఎం ప్రకటించారని రోజా అన్నారు. ఏపిఐఐసి ద్వారా భూముల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తామని రోజా చెప్పారు