అమరావతి: కియా మోటార్స్ వైఎస్ఆర్ వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదంటూ వ్యంగంగా విమర్శించారు.
‘కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, జగన్ క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ట్వీట్తో పాటు అసెంబ్లీలో బుగ్గన మాట్లాడుతున్న వీడియోలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన సినిమాలో ఒక సన్నివేశాన్ని, జబర్ధస్త్ సన్నివేశాలను, పలు పేపరు క్లిప్పింగ్స్ను మిక్స్ చేసిన వీడియోను పోస్టు చేశారు.
కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, @ysjaganగారి క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు.
*Whatsapp Forward* ???? pic.twitter.com/WI7KMRqZG8
— Lokesh Nara (@naralokesh) July 15, 2019